Friday, 8 May 2015

తల్లీ !

 తల్లీ !

తల్లీ ఎవరు కన్నారు అమ్మా మమ్మలను కన్న  నిన్ను ,?
ఎవరైతే నేమి, మాతవు , తండ్రిలేని  మాపాలిట దైవానివి.
 మరి ,ఎందుకు కొందరే నీకు జై కొడతారు? వాళ్ళ జాగీరులా ప్రవర్తిస్తారు .
వారే , ఆకొందరే యందుకు నిన్ను  
ప్రేమించినట్లు భావిస్తారు?  ఓంకారాలు ఘీంకరిస్తారు .
వారికి మాకు విభేదాల వంతెనలు ఎవరు కట్టారు?
ద్రౌపదిలా   పక్షపాతచిత్రనెందుకో?
జాతీయ పటానికి నిలువెత్తై 
పట్టు వస్త్రం తో విరబూసిన కురుల కిరీట ఠీవిగా నిలెట్టి
చేతిలో ఎవరు పెట్టరమ్మా ? ఆ జెండా
తిరంగమో, త్రివర్ణ మో, కొండకచొ  కాషయమో
ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు . ధర్మచక్రాన్ని అధర్మం పాల్జేయడానికా?
జాతీయ చిహ్నం పులికదా! నీ ప్రక్కన ఆ సింహమేమిటీ?
క్రూర జంతువుతో నీకేమి పని? ఏమిటి ఈ ఉన్మాద వైపరీత్యం.?
నిన్ను ఒకరు బొమ్మ తల్లినిచేస్తే ,ఒకరు పురాణ స్త్రీని చేసారే  పబ్బం కోసం.
నీకు చరిత్ర కూడా వ్రాస్తారు స్వార్ధం కోసం,  
గాంధి తాతను జాతి పితను చేసి , తండ్రినే చంపుకున్న చాణక్య చరిత్రమాది
చివరాకరికి మేము భారతీయులము , మముగన్న మాయమ్మలను
వెతుక్కునే వేటలో రాష్ట్రానికొక తల్లిని సృష్టించుకుంటున్నాం .
శంకరంబాడి పాట తో పూర్ణ కుంభం చేతపట్టి,
వరి కంకులు వెదజల్లుతూ తెలుగుతల్లి విలసిల్లితే
జొన్నపొత్తులు  చేతబూని, బోనాలతో నీ వారసురాలు
అరణాల తెలంగాణా తల్లి పురిటిలో అపశ్రుతులెన్నో .
 పుట్టింది మొదలు  ఆ తల్లికి జన్మనిచ్చినపిల్లలే
పెద్దమ్మతల్లికి  పంగనామాలు పెడతారు . 
తల్లులు లేని దేశాలు అనాధులేమీకాదు, గానీ ప్రగతి పధాన
దూసుకుపోయే కొత్త నీటి పునాదులు.  
 పితలు మాతలు వున్నా మనం మాత్రం
వెనక్కి నడుస్తున్న సంప్రదాయ సమాధులం.
                      డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .                               



No comments:

Post a Comment