A renowned poet, writer, transalator and a social activist. A doctor (pulmonologist) by profession.
Tuesday, 14 December 2021
NEET లో నీతి ; ఓ వివాదం
NEET లో నీతి ; ఓ వివాదం
NEET అనేది మెడికల్ కాలేజి లో MBBS లో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష. ఈ NEET పై కేంద్ర వైఖరి నీట్ గా లేదు. అన్ని వ్యవస్థ లతో పాటూ వైద్య విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడం, ఆశ్రిత పక్షపాత ధోరణి అవలంబించడంతో ఈ వివాదానికి తెర లేచింది. దీనుకి ద్రావిడ పార్టీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడు ప్రముఖ పాత్ర పోషించడంతో వివాదానికి ప్రాధాన్యత ఏర్పడింది. 12త్ క్లాస్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెడికల్ కాలేజీల్లో సీట్ల పంపిణీ జరగాలనేది తమిళనాడు ప్రభుత్వ ప్రధాన డిమాండ్. దీనికి అనేక సాంకేతిక సామాజిక హేతుబడ్డ మైన కారణాలను చూపడంలో ఆ ప్రభుత్వం సఫలీకృతమైంది. అందులో NEET వలన జరిగే ప్రధాన నష్టాలను ప్రజల ముందు ఉంచడం ఒకటి. అదే సామాజిక న్యాయం అంశం. దెస వ్యాప్త ప్రవేశ పరీక్షలో స్టేట్ సిలబస్ వారు, గ్రామీణ ప్రాంతాలలో చదివినవారు CBSEచదివిన వారితో పోటీ పడలేరనేది రాజీ లేని వాస్తవం, మరి అలాంటివారితో NEET పరీక్షలో ఈ వెనుకబడిన విద్యార్ధులు ఎలా పోటీ పది నెగ్గుకు రాగలరు. పట్టణాల్లో డబ్బు తో చదువు ముదిప్పడి ఉంది. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంట మంచి కోచింగ్ సెంటర్ లో అంట ఉత్తమ టీచర్ల ద్వారా తర్ఫీదు ఉంటుంది. ఎలా చూసినా NEET సామాజిక ఆర్ధిక వ్యత్యాసాలను పెంచుతూ సామాజిక అన్యాయానికి దారి తీస్తుంది. నిజానికి ఈ NEET ప్రతిపాదనను CBSE బోర్డూ,MCI(మెడికల్ కౌన్సిల్)రెండూ ఆదిలోనే వ్యతిరేకించాయి. ఈ ప్రహాసనం 2013లోనే ఆరంభమైంది. NEET ప్రారంభంతో PGI ఛండీగర్,AI IMS ఢిల్లీ, GIPMER పాండిచెర్రి లలోని కేంద్ర ప్రవేశ పరీక్షలను రద్దు చేసి వైద్య విద్య లోని నాణ్యత తో రాజీ పడింది. దీనికి కేంద్ర ఇచ్చే జవాబు ఒకే విద్యా విధానం లో మెరిట్ ఉంది, విద్యార్ధుల పై వొత్తిడి ఉండదు, అనేక ఎంట్రేన్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, అందరకీ అవకాసం ఉంటుంది, పారదర్సకత ఉంటుంది, సీట్ల స్కాం కుదరదు లాంటి వాదనలను తేరా మీదకు తెసుంది.
తమికనాడు ప్రభుత్వం కేంద్రం పై చేస్తున్నప్రధాన మైన ఆరోపణ ఒకటి న్యాయపరమైనది, రెండవది విద్యా వ్యవస్థ పరమైనది. మూడవది విద్యార్ధుల ప్రాణాలకు సంబందించినది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (అమెండమేంట్)బిల్ 2016 ప్రకారం NEET పరీక్ష వద్దుకునే రాష్ట్రాలు వారు వారికి ఇష్టమైన పద్దతులను అనుసరించవచ్చనేది ప్రధానాంశం. ఆ రాజ్యంగా సవరణ మేరకు తమిళనాడు ప్రభుత్వం NEET వద్దనుకుంది. ఎందుకంటే కేంద్ర వైఖరి డబ్బున్న వారికీ, పట్టణాల్లో చదువుకున్నవారికీ సులభతరమై వర్గ వివక్ష, కుల వివక్ష, లింగ వివక్ష తో పాటూ ఆడపిల్లలకూ గ్రామాల్లో చదివి పైకివచ్చిన వారికీ, ఇతర వెనుక బడ్డ వర్గాలవారికీ ఈ వైద్య విద్య దూరం చేసే కుట్రగా కనిపించింది. అలాగే విద్యార్ధులకు వొత్తిడిని మూడింతలు చేస్తుంది. కుటుంబ సభ్యుల నుండీ వచ్చే వొత్తిడి ని , కోచింగ్ సెంటర్ నుండీ వచ్చే వొత్తిడి నీ ,తోటి విద్యార్ధులతో పోటీ వొత్తిడి నే తట్టుకోలేక ఆత్మహత్యలు పాల్పడడం సభ్యసమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది.
“క్షమించండి ,అలసిపోయాను” అని రాసి 19సంవత్సరాల బాలిక మదురై లో ఆత్మహత్య చేసుకుంది. ఆదిత్య రెండవసారి NEET ఫెయిల్ అయి ధర్మపురిలో మూడవ సారి తప్పి ఆత్మహత్యచేసుకున్నాడు.మోతీలాల్ ,విజ్ఞేశ్ ఇలా వరుసగా 13మంది విద్యార్ధులు NEET పరీక్షలో ఉత్తీర్ణులు కాలేక ప్రానాలర్పించుకున్నారు. గత కొద్ది కాలంలో ఇవి ఇంకా పెరగడం తో స్టాలిన్ ప్రభుత్వం NEET రద్దు పై తన నిర్ణయాన్ని ప్రకటించిది. తమిళనాడులో బిజెపి తో పాటూ AIDMKలు తప్ప అన్ని ప్రధాన పార్టీలు స్టాలిన్ కు మద్దతు ప్రకటించాయి. ఈ విద్యార్ధుల ఆత్మహత్యల ప్రహాసనం కేవల తమిళనాడుకే పరిమితం అనుకుంటే పొరపాటు.రాజస్తాన్ లోని కోటా , తెలంగాణా,ఆంధ్రప్రదేశ్, కేరళలలో కూడా అనేక మంది విద్యార్ధులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అనిత అనే అమ్మాయిది మరోక విషాదం. ఇంటర్ లో 1200 కు 1176 మార్కులు తెచ్చుకుని NEET లి ఫెయిల్ అవడం తో ఆత్మహత్య చేసుకుంది.ఈమెకు ప్రతిభ లేదనాలా?జాతీయత పోటీలో నిలబడ లేక పొయిందనాలా? భాషా పరమైన ఇబ్బందా? . ఇదే NEETకు సంబంధించిన రెండు బిల్లుయ్లను కూడా సెప్టెంబర్ 20౧౭ లో రాష్ట్రపతి రిజక్ట్ చేసారు, ఇదే ప్రశ్న ను మద్రాస్ హై కోర్టు లేవనెత్తింది. ఆట అనేది సమాన స్థాయి లో సమాన అవకాశాలు ఇచ్చి సమాన క్రీడాకారుల మధ్య ఆడించాలి. బోధనా మీడియం లో వ్యత్యాసాలు,బోధనా స్థాయిలో వ్యత్యాసాలు, కర్రికులం లో వ్యత్యాసాలు, కాలేజి సిలబస్లో వ్యత్యాసాలు, వెనుకబాటుతనం ఇలా ఇన్ని వ్యత్యాసాలను ఉంచుకుని కామన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడం లో హేతుబద్దత లేదని నిరూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. స్వాగాతించడమే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా పై వ్యత్యాసాలను ద్రిష్టిలో ఉంచుకుని విధ్యార్త్దుల ఆత్మహత్యలను సంస్థాగతమైన హత్యలుగా పరిగణించాలీ. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ ఏకపక్షంగా ఉండకూడదు. కోచింగ్ కు అవకాసం లేని వారు, ఉన్నతవర్గాలనుండీ ఆసరా కరువైనవారు, సామాజికంగా ఆర్ధికంగా ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత చదువుల వైపు నడుస్తున్న వెనుకబడిన, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోరే వారైతే సర్వ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొస మెరుపు ; ఏమిటంటే అమెరికన్లకూ ఆసియా అమెరికన్లకూ మద్య వివక్షా పూరిత వ్యత్యాసాలను తొలగించేందుకు ఇటీవల యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా SAT/ACT అనబడే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను రద్దు చేసింది.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment